నవగీతం,కరీంనగర్:
కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కోలగాని శ్రీనివాస్ కి పద్మశాలి పర సన్నిధి స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. పర సన్నిధి సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలను మేయర్ కి వివరించారు. దీనికి ఆయన స్పందిస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తన వంతు సహాయ సహకారాలు మీ పరసన్నిధి సేవాసమితికి ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గజవెల్లి కనకయ్య, పిస్క లక్ష్మీనారాయణ, కొప్పుల కొక్కుల గోవర్ధన్, ఎలిగేటి శ్రీనివాస్, ఆడెపు మునిందర్, కొక్కుల అశోక్, వెంగల్ దాస్ అశోక్, దేకొండ అశోక్, అడిగొప్పుల రవీందర్, ఎలిగేటి కిషన్, సమ్మయ్య , మాసం సుధాకర్ పాల్గొన్నారు.