వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పీట్ల శ్రీధర్
నవగీతం, మెట్ పల్లి
గ్రామస్థాయిలో తో పాటు రాష్ట్రస్థాయిలో రాజకీయం వ్యాపార రంగాలలో వడ్డెర కులస్తులు ముందుండాలని జాతీయ ఒడ్డెర సంఘం అధ్యక్షుడు పీట్ల శ్రీధర్ అన్నారు. బుధవారం మెట్ పల్లి పట్టణంలో మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన వడ్డెర సంఘ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం వడ్డెర కులస్తులు అన్ని రంగాలు ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సబ్సిడీ పథకాలతో పాటు వ్యాపారం రాజకీయంలో ముందుకు రావాలని కోరారు. ఇక్కడ మల్లాపూర్ మండల వడ్డెర సంఘం నాయకులు భోధస్ శేఖర్, మహేష్ తదితరులు ఉన్నారు