జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
బుధవారం జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో (జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్) జరుగుతున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలను కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ ద్వారా జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. వివిధ మున్సిపాలిటీలలోని పోలింగ్ కేంద్రల్లో పోలింగ్ కేంద్రం లోపల ఓటింగ్ సరళి, పోలింగ్ కేంద్ర బయట ఓటర్ల రద్దీ వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

అలాగే పోలింగ్ జరుగుతున్న తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.రిపోర్ట్ లను సూచించిన సమయం ప్రకారం ప్రతి రెండు గంటలకు ఒకసారి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.