నవగీతం, మెట్ పల్లి:
మెట్ పల్లి పట్టణంలోని సిద్దార్థ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మల్లాపూర్ కి చెందిన రాజారెడ్డి అనే వ్యక్తి కి అత్యవసరంగా ఏబి పాజిటివ్ ప్లేట్ లెట్స్ ఎక్కించాలని వైద్యులు సూచించటంతో బంధువులు డోనార్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ భారతి బ్లడ్ బ్యాంకు లో సంప్రదించగా వివిధ వాట్సాప్ గ్రూప్ లలో పోస్ట్ ని చూసి స్వచ్చందంగా స్పందించి జగిత్యాల కి చెందిన మెహన్ రెడ్డి ఏబి పాజిటివ్ ప్లేట్ లెట్స్ దానం చేయడం జరిగింది.మెహన్ రెడ్డి ని పేషేంట్ బంధువులు, బ్లడ్ బ్యాంకు సిబ్బంది పలువురు అభినందించారు