నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
పోలీసు శాఖలో గత 36 సంవత్సరాలుగా విధులు నిర్వహించి ప్రస్తుతం వెల్గటూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్న ఏ ఎస్సై సూర్యనారాయణ రాజు ను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.సుధీర్ఘ కాలంగా పోలీస్ శాఖ లో విధులు నిర్వహించి సేవలు మరువమని అన్నారు.పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ కిరణ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
