నవగీతం, జగిత్యాల/ధర్మపురి:
జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి తీరం వద్ద సానిటేషన్ పరిస్థితులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు. అనంతరం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి పరిశుభ్రత (సానిటేషన్) పరిస్థితులను పరిశీలించారు. అలాగే ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, ల్యాబ్ సేవలు, వైద్య సేవలు, ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.