నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో గోదాములను పరిశీలించిన కలెక్టర్

నవగీతం, మల్లాపూర్ మల్లాపూర్ మండలం ముత్యం పేట గ్రామంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సందర్శించారు.ఈ సందర్భంగా ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న గోదాములను పరిశీలించి, రాబోయే రబీ సీజన్‌కు సంబంధించి వడ్ల నిల్వకు అవి అనువుగా ఉన్నాయా లేదా అనే విషయంపై సమగ్రంగా పరిశీలించారు.గోదాముల సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, తేమ నియంత్రణ వంటి అంశాలను పరిశీలిస్తూ, వడ్లను సురక్షితంగా నిల్వ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.అదేవిధంగా, మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో వడ్లు...