నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
మార్చి 6వ తేదీ నుండి జూన్ 12 తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అమలుపై పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, ఆర్ &బి, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, మహిళ మరియు శిశు సంక్షేమ, సంక్షేమ శాఖలు, మెప్మా మరియు మున్సిపాలిటీలు తదితర శాఖల అధికారులతో ప్రాథమిక సమీక్షా సమావేశం నిర్వహించారు.