నవగీతం, మెట్ పల్లి:
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రోజున అకాడమిక్ ఆడిటింగ్ సంబంధించిన వివిధ రిజిస్టర్లు, రికార్డులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య పరిశీలించారు.ఈ సందర్భంగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను అకాడమిక్ ఆడిట్ త్వరలో జరగనుందని అందుకు సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్లు, మార్కుల రిజిస్టర్లు, బోధనకు సంబంధించి వివిధ రికార్డులు,రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, అన్ని రికార్డులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని బోధనా సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దేవన్న, కళాశాల అకాడమిక్ కో- ఆర్డినేటర్ బిల్ల రాజేందర్ , కామర్స్ హెచ్ ఓ డి మనోజ్ కుమార్, లెక్చరర్లు అంజయ్య, శ్రీకాంత్, సత్యశోధన్ , దశరథం తదితరులు పాల్గొన్నారు.