నవగీతం, మల్లాపూర్:
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం రెండవ రోజు మల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ పరిసరాల్లో గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో చెత్త చెదారం తొలగించి పిచ్చి మొక్కలను కట్ చేసి చీపుర్లతో శుభ్రం చేసారు. పాఠశాల పరిసరాల్లో శుభ్రంగా ఉంచాలని సర్పంచ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్,కార్యదర్శి గూరుడు శ్రీనివాస్,ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్ , మహమ్మద్ షబ్బీర్, అరికుప్పల రాజం, ముష్కరి రమేష్,అల్లె చంద్రయ్య, శనిగారపు నరేష్, కదుర్క లక్ష్మి, ఏనుగు లక్ష్మి, కాషవత్తుల లక్ష్మి,అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.