నవగీతం,రాయికల్ ప్రతినిధి:
రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో గ్రామానికి చెందిన పల్లి సంజన అంజయ్య దంపతులకు, రాయికల్ పట్టణ 3వ వార్డుకు చెందిన సాథర్ల రత్నమ్మ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయి బుధవారం గృహ ప్రవేశం సందర్భంగా వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై ఇందిరమ్మ ఇళ్లు ను ప్రారంభించి,శుభాకాంక్షలు తెలిపి,చీరను కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి,మున్సిపల్ చైర్మన్ కట్కం రవి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్రావు,సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, ఏనుగు మల్లారెడ్డి, గన్నె రాజిరెడ్డి ,మాజీ సర్పంచ్ జీవన్ రెడ్డి, కౌన్సిలర్లు రాకేష్, పల్లికొండ గంగాధర్, ఉపసర్పంచ్ తాలూకా రాజేశం, మాజీ ఎంపిటిసి రవి, నాయకులు సురేష్ ,వినోద్ రావు, నర్సయ్య, తిరుపతిరావు,మాజీ సర్పంచ్ ముత్తయ్య, తిరుపతి, జలంధర్ రెడ్డి, జగన్ ,పవన్ ,బాలయ్య,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
