ఎండ తీవ్రతకు తగు జాగ్రత్తలు తీసుకోండి
చలువ పందిరి ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్
నవగీతం,వేల్పూర్ ప్రతినిధి:
వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలొ విబిజిరామ్ జి ఉపాధి హామీ పథకం క్రింద మల్కాచెరువు పుడుకతీత పనులను గ్రామ సర్పంచ్ జిన్నా జనర్ధన్ వార్డు సభ్యులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎండతీవ్రతా ఎక్కువ ఉంది కాబట్టి తాగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.విశ్రాంతి తీసుకోవడానికి చలువ పందిరి, మంచినీరు ఏర్పాటు చేశామని తెలిపారు.ఉదయము పనులకు వచ్చే ముందు రాగి జావా అంబలి మరియు నిమ్మ రసం వాటర్ మీలాన్ లాంటివి తీస్కొని రావాలని సూచించారు. ఒక్క వేల ఎవరికైన ఎండకు తల తింపినట్టు అయితే వెంటనే ఓఆర్ ఎస్ పాకెట్టు నీళ్లలో కలుపు కొని త్రాగాలని ఉదయం 6 గంటల వరకు వచ్చి తొందరగా పని ముగించుకొని వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమం లొ సర్పంచ్ జిన్నా జనార్దన్ ,ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి సతీష్ ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్ వార్డు సభ్యులు సురేష్ సునంద ఆశ కార్యకర్త నర్సు పాల్గొన్నారు.
