navageetam.com
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 4:52 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కలెక్టరేట్ లో ఘనంగా మహాత్మ బసవేశ్వరుని జయంతి

నవగీతం, జగిత్యాల

నవగీతం, జగిత్యాల

సామాజిక సంస్కర్త మహాత్మ తత్వవేత్త, బసవేశ్వర (బసవన్న) జయంతి సందర్భంగా  సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..12వ శతాబ్దపు తత్వవేత్తగా బసవేశ్వరుడు సమానత్వాన్ని బోధించారని, అనునభవ మంటపం స్థాపించారని అన్నారు. కుల, లింగ, వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా బసవేశ్వరుని తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని అన్నారు. సమాజంలో అహింస ద్వారా సమాజానికి మంచి మార్గాన్ని ఎన్నుకొని జీవించేలా బసవేశ్వడు బోధనలు చేశాడని గుర్తు చేశారు. సమానత్వం, సత్యం, న్యాయం వంటి మహోన్నత విలువలను మన జీవన విధానంగా మార్చాలని బోధించిన మహానుభావుడు బసవన్న. అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నతంగా జీవించేవిధంగా బసవేశ్వరుడు బరోసా కల్పించాడన్నారు. సమాజ హితం కోసం పాటుబడిన బసవేశ్వరుడి మార్గం అందరికి ఆచరణీయమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి. ఎస్ లత, బి. రాజ గౌడ్, జిల్లా బి.సి వెల్ఫేర్ అధికారి జి. సునీత, జిల్లా స్థాయి అధికారులు, వివిధ స్థాయిల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.