navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 3:46 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కెసిఆర్ బహిరంగ సభకు సభ స్థలిని పరిశీలించిన మాజీ మంత్రి కొప్పుల

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించి మోతె రోడ్డు పక్కన గల స్థలాన్ని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు , ఎమ్మెల్సీ ఎల్. రమణ కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటిని కూడా నెరవేర్చలేదన్నారు.జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు.జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. జగిత్యాల సభను భారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు, ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని, లక్ష మందితో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్, మాజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా మాజీ డిసియంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి , లోక బాపురెడ్డి, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.