navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 2:56 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కోరుట్లలో చలివేంద్రం ప్రారంభం

బాటసారుల దాహార్తిని తీరుస్తున్న డాక్టర్ రాజేష్ రేగొండ

నవగీతం కోరుట్ల ప్రతినిధి:

వేసవి కాలం దృష్ట్యా పెరుగుతున్న ఎండల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కోరుట్ల పట్టణంలోని బాటసారుల మరియు ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజేష్ రేగొండ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. స్థానిక ప్రజలతో కలిసి పట్టణంలోని ప్రధాన కూడలిలో ఆయన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.డాక్టర్ రాజేష్ రేగొండ స్థానికులు మరియు మిత్రులతో కలిసి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎండలు మండిపోతున్న వేళ, పని నిమిత్తం బయటకు వచ్చే పేదలు, కార్మికులు మరియు ప్రయాణికులకు చల్లని తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత మరియు వ్యాపారులు చురుగ్గా పాల్గొని, డాక్టర్ గారు చేపట్టిన ఈ మంచి పనిని కొనియాడారు. “వైద్యుడిగా రోగుల సేవ చేయడమే కాకుండా, సామాజిక బాధ్యతగా ఎండలో అలసిపోయే బాటసారులకు మంచినీరు అందించడం సంతోషంగా ఉంది.” అని వ్యక్తం చేశారు. ఈ చలివేంద్రం ఏర్పాటు పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి ముగిసే వరకు ఈ కేంద్రం ద్వారా నిరంతరాయంగా మంచినీటి సౌకర్యం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.