నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా మున్సిపల్ మాజీ చైర్మన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఎన్నిక కావడం సందర్భంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సమాజ సేవలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆమె ఈ బాధ్యతలు చేపట్టడం క్లబ్ కార్యకలాపాలకు కొత్త దిశను తీసుకువస్తుందని పలువురు పేర్కొన్నారు. ప్రజలకు చేరువగా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించగల సామర్థ్యం ఆమెకు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రతినిధులు, నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను మరింత ప్రభావవంతంగా అమలు చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.