నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. బీజేపీ మండల ఉపాధ్యక్షులు శెట్టి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. గ్రామంలోని ప్రధాన కూడలి ప్రాంగణంలో శెట్టి రవి పార్టీ జెండాను ఆవిష్కరించారు.పార్టీ ఆవిర్భావం సందర్భంగా కేక్ కట్ చేసి, కార్యకర్తలకు గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా శెట్టి రవి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగిందని, దేశాభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో 252 బూత్ అధ్యక్షులు ఏగోలపు సంతోష్తో పార్టీ నాయకులు బండారి ప్రభాకర్ లక్కం సంజివ్,మారుశెట్టి శ్రీకాంత్ కొప్పెర రాజ్ కుమార్,అరిగేలా రాజేష్ ఆరిగెలా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.