నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
ధర్మపురి బార్ అసోసియేషన్ అధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సామాజిక ఉద్యమాలు, సేవలను కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అధ్యక్షులు బందెల రమేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మామిడాల శ్రీకాంత్ కుమార్ మహిళ ప్రధినిథి కలమడుగు కీర్తి మరియు న్యాయవాదులు రౌతూ రాజేష్,అలుక వినోద్ కుమార్, కస్తూరి శరత్ కుమార్,జాజల రమేష్ లు పాల్గొన్నారు