నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి
మల్లాపూర్ మండల కేంద్రం లో ఈ రబీ(వేసంగి )సీజన్లో గ్రామ పరిధిలో అత్యధికంగా వరి పంట సాగు చేశారు.ప్రస్తుతం పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైంది. గ్రామంలోని రైతులందరూ ధాన్యం విక్రయించడానికి సిద్ధం గా ఉన్నారు.కనుక వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మల్లాపూర్ మాజీ ఎంపిటిసి మొరపు గంగా రాజం మల్లాపూర్ తహసీల్దార్ రామచందర్ కు వినతి పత్రం అందజేశారు.వీరితో సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి ఉన్నారు.