navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 1:35 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పద్మశాలి సంఘ నూతన కమిటీ ఏకగ్రీవం

నవగీతం, మల్లాపూర్,:

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో పద్మశాలి సంఘ భవనంలో ఆదివారం సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆడెపు రాజేష్  ఉపాధ్యక్షులు కొండ గణేష్ కార్యదర్శి దువ్వ నవీన్,ఆలయ కమిటి అధ్యక్షులు కట్కం జనార్దన్, ఉపాధ్యక్షులు సామల్ల నాగభూషణం ఐక్య వేదిక సభ్యులు అరిసెల్ల మనోహర్ గౌరవ అధ్యక్షులు చెన్న నర్సయ్య సలహాదారులు అందె సత్యం దైవశెట్టి వాసం శంకర్ సంఘ సభ్యుల సమక్షంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఆడేపు రాజేష్ మాట్లాడుతూ ..పద్మశాలి సంఘం బలోపేతానికి ఆలయ అభివృద్ధి కొరకు పనిచేస్తానని సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఎన్నికకు సహకరించిన పద్మశాలి కుల బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు.