నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వశిష్ట అప్పర్ ప్రైమరీ స్కూల్ ను రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ తల్లిదండ్రుల ఆశయాలకు అనుకూలంగా విద్యార్థులకు విద్యను అందించాలని మంత్రి సూచించారు.మంత్రి వెంట జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణితో పాటు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య తదితరులు పాల్గొన్నారు.
