నవగీతం, కరీంనగర్:
తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళల స్థితిగతులపై స్పష్టమైన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం ఇక ఆలస్యం చేయరాని అవసరమని ఆమె స్పష్టం చేశారు. మహిళల సాధికారతే సమాజ పురోగతికి అసలైన దారిగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, అన్ని రంగాల్లో మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారని, సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే దేశ అభివృద్ధిని ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తారని దృఢంగా తెలిపారు. మహిళలను బలపరచడం అనేది సామాజిక బాధ్యతగా చూడాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరియు కౌన్సిలర్లు , కో ఆప్షన్స్ మెంబర్స్ , మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
