విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ కార్మికురాలు మృతి

ఆర్థిక సహాయం అందజేత నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి : మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న మోర్తాడ్ భాగ్యలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన ఆమె కుటుంబాన్ని మున్సిపల్ పాలకవర్గం మరియు తోటి కార్మికులు అక్కున చేర్చుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారం లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, 11వ వార్డు కౌన్సిలర్ రెబ్బాస్ మహేష్, 4వ వార్డు కౌన్సిలర్...