navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 12:17 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వేసవిలో త్రాగు నీటి కష్టాలు..పట్టించుకోని అధికారులు!

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల పట్టణంలోని 3వ వార్డు సాయిరాం కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక చేతి బోరు పంపు నిరుపయోగంగా దర్శనమిస్తోంది.  

ఏళ్ల తరబడి అందని మరమ్మతులు

సాయిరాం కాలనీలో ఉన్న ఈ చేతి పంపు కనీసం మరమ్మతులకు కూడా నోచుకోక తుప్పు పట్టిపోతోంది. ఒకప్పుడు కాలనీ వాసుల దాహార్తిని తీర్చిన ఈ బోరు పంపు, నేడు కేవలం ఒక ఇనుప ముక్కలా మిగిలిపోయింది. వర్షాకాలం, శీతాకాలం గడిచినా పట్టించుకోని యంత్రాంగం, ఇప్పుడు ఎండలు మండిపోతున్నా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దాహార్తిని తీర్చండి మహాప్రభో!

ప్రస్తుతం ఎండలు ముదురుతుండటంతో నీటి ఎద్దడి పెరిగే అవకాశం ఉంది. కనీసం ఈ ఏడాది అయినా వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.ఈ ఒక్క బోరు పంపును బాగు చేయిస్తే, కాలనీలోని ఎన్నో కుటుంబాలకు నీటి కష్టాలు తీరుతాయి.

అధికారులకు విన్నపం

మున్సిపల్ అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ బోరు పంపుకు మరమ్మతులు చేయించి, కాలనీ వాసులకు నీటి సమస్య నుండి ఉపశమనం కలిగించాలని సాయిరాం కాలనీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారులైనా స్పందిస్తారో లేదో వేచి చూడాలి.