navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 2:49 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

క్యాన్సర్ బాధితురాలికి అండగా మిత్రమా ఫౌండేషన్

రూ.82,600 విరాళాన్ని అందజేసిన పూర్వ విద్యార్థులు

నవగీతం, వేల్పూర్ ప్రతినిధి:

భీంగల్ మండలంలోని కుప్కల్ గ్రామానికి చెందిన గాజబోయిన నవనీత బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వేల్పూర్ కు చెందిన 2006-07 ఎస్సెస్సి పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న “మిత్రమా ఫౌండేషన్” ద్వారా బుధవారం బాధితురాలి స్వగ్రామం కుప్కల్ లోని గాజబోయిన నవనీత ఇంటికి వచ్చి భర్త గాజపోయిన సురేష్ తల్లి సమక్షంలో   రూ.82,600 రూపాయల్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మిత్రమా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గాజబోయిన నవనీత సరైన వైద్యం చేయించుకుని త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.