శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణంలోని మేరు సేవా సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు వారు శుభాకాంక్షలు తెలియజేసి, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం సంఘం ప్రతినిధులు అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దాసరి లావణ్య ప్రవీణ్, సంఘం అధ్యక్షుడు రాపర్తి వినోద్, ప్రధాన కార్యదర్శి గట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, సహాయ కార్యదర్శి రాయిళ్ల శ్రీధర్, కోశాధికారి గట్ల శ్రీకర్, మాజీ అధ్యక్షుడు మల్లేశం, పట్టణ నాయకులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
