navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 4:55 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జిల్లాలో మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం.

డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాలో పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శుల నియామకాలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు చేపట్టినట్టు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య తెలిపారు.ధర్మపురి మండల అధ్యక్ష, కార్యదర్శులుగా చిలుముల లక్ష్మణ్ కాసారపు బాల గౌడ్, బుగ్గారం మండల అధ్యక్ష కార్యదర్శులు గా నగునూరి నరసాగౌడ్, బత్తుల తిరుపతి, ఎండపల్లి అధ్యక్ష కార్యదర్శులు గా గెళ్ళు శేఖర్, రాజేశం, గొల్లపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులుగా రాపల్లి గంగన్న, జల్లి అనిల్ యాదవ్, పెగడపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు గా కడారి తిరుపతి, చాట్ల భాస్కర్ లను నియమించినట్లు తెలిపారు. అలాగే కోరుట్ల అధ్యక్షులుగా పన్నాల అంజయ్య, మల్లాపూర్ అధ్యక్షులుగా మాట్ల సోమయ్య, ఇబ్రహీంపట్నం అధ్యక్షులుగా గూడ శ్రీకాంత్, మెట్ పల్లి అధ్యక్షులుగా జంగిటి రాజేందర్, కోరుట్ల పట్టణ అధ్యక్షులుగా తిరుమల గంగాధర్, మెట్ పల్లి పట్టణ అధ్యక్షులుగా మహమ్మద్ రయిసుద్దీన్, లను నియమించినట్లు పేర్కొన్నారు