navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 6:04 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జువ్వాడి నర్సింగరావును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఐ లక్ష్మీనారాయణ

నవగీతం,కోరుట్ల ప్రతినిధి :

కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె. లక్ష్మీనారాయణ ఈరోజు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఐ లక్ష్మీనారాయణకు జువ్వాడి నర్సింగరావు శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా నిరంతరం కృషి చేయాలని కోరారు. అనంతరం వారు నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్, కోరుట్ల మండల మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల 4వ వార్డు కౌన్సిలర్ తెడ్డు శ్రీజ విజయ్, ధర్మారం సర్పంచ్ దొడ రంజిత్ రెడ్డి, తిమ్మయపల్లి సర్పంచ్ పల్లపు లత అశోక్, రాకేష్ రెడ్డి, గుగ్గిళ్ళ సురేష్ తదితరులు పాల్గొన్నారు.