navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 11:47 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు

హర్షం వ్యక్తం చేసిన పులిమామిడి ప్రవీణ్ కుమార్

నవగీతం ,మెట్ పల్లి ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావును నియమిస్తూ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్ పులిమామిడి ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నర్సింగరావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో కార్పొరేషన్ ద్వారా ప్రజలకు, ఆయా వర్గాలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన వ్యక్తికి ఈ పదవి దక్కడం ఆనందదాయకమని, ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు.