నవగీతం, జగిత్యాల/ధర్మపురి:
ధర్మపురి మండలం తుమ్మనాల గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి శెకెల్ల సత్తమ్మ ఇటీవల మరణించగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గా సత్తమ్మ గ్రామానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. మంత్రి వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, గ్రామ సర్పంచ్ జగదీష్ తో పాటు నాయకులు వేముల రాజు, ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్ చీపిరి శేట్టి రాజేష్, మాజీ సర్పంచ్ మల్లేష్ తదితరులు ఉన్నారు.