నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:
మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన ఎండీ రైసోద్దీన్ను జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీరం రాజేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు రైసోద్దీన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు నాయిని సురేష్ గౌడ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పెంట ప్రణయ్, జిల్లా ఉపాధ్యక్షులు అమ్ముల రాహుల్, బలుసు సాయి కుమార్, ఎండీ మౌసిన్, జగిత్యాల అసెంబ్లీ అధ్యక్షుడు కర్ణే భూమారెడ్డి, మెట్పల్లి పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుల్లూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.