నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకర్ రావు వర్ధంతి వేడుకలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. కాగా ఆదివారం డబ్బా గ్రామంలో డబ్బా గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూస రాజేశ్వర్ ఆధ్వర్యంలో రత్నాకర్ రావు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ లింగంపల్లి గంగాధర్, పుప్పాల గజేందర్, తేలు రమేష్, జాన శంకర్, తేలు నరేష్ ముద్ద నరేందర్ రాడే పెద్ద సాయన్న తదితరులు పాల్గొన్నారు