నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
వడ్డేర కమ్యూనిటీ పైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేయడం పట్ల వడ్డేర సంఘం మాజీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ బోసు రాము వడ్డేరాజ్ హర్షం వ్యక్తం చేశారు.. ఈ నిర్ణయం తో వడ్డేర సమాజానికి సరైన గౌరవం దక్కిందన్నారు.. నేడు వడ్డేరలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని , వారి అర్థికాభివృద్దికి కార్పోరేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సమాజ అభివృద్ధి దోహదపడుతుందని పేర్కొన్నారు.. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తేలియజేశారు..