నవగీతం , కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) లక్ష్మీనారాయణను మంగళవారం కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా 27వ వార్డు కౌన్సిలర్ ఇందూరి తిరుమలవాసు, 7వ వార్డు కౌన్సిలర్ గుగులావత్ శ్రీకాంత్ మరియు రాజేందర్ సిఐ పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని పలు అంశాలపై వారు ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.
