నవగీతం,వేల్పూర్ ప్రతినిధి:
వేల్పూర్ మండల కేంద్రమైన పడగల్ గ్రామంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం వారి ఆధ్వర్యంలో ఆరు తడి పద్ధతులు మరియు సివిఆర్ నూకల మెథడ్ ద్వారా కలుపు ని అరికట్టడానికి పాటించిన రైతు తల్కల రాజేష్ వరి పొలంలో పంట కోత ప్రయోగం చేయడం జరిగినది. ఈ ప్రయోగం ద్వారా వరిలో కలుపు నివారించవచ్చు దిగుబడిలో ఎలాంటి రాజీ లేకుండా, తక్కువ కలుపు, ఖర్చు తగ్గించుకుంటూ మంచి దిగుబడులను తీసుకున్నారు.ఈ వరి పంట కోత ప్రయోగం కార్యక్రమంలో పడగల్ ఏఈఓ సాయిరాం రాజ్, సుస్థిర వ్యవసాయ కేంద్రం సిఆర్పి చింత శ్రీనివాస్ ,భార్గవ్ , రైతు రాజేష్ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు.