– లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ కలాల రాధసాయిచంద్
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో పెన్షన్ పొందే లబ్ధిదారులందరు ‘లైవ్ అథెంటికేషన్’ (బయోమెట్రిక్/ఫేస్ అథెంటికేషన్) కౌన్సిలర్ ఇంటి వద్ద గల ఆఫీసులో మున్సిపల్ వార్డు అధికారి (వార్డ్ ఆఫీసర్) అందుబాటులో ఉంటారు. ఈ సేవలు వినియోగించుకోవాలని వార్డు కౌన్సిలర్ కలాల రాధా సాయిచంద్ తెలిపారు.ఈ సేవలు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు, మరల మధ్యాహ్నం 03:00 గంటల నుండి సాయంత్రం 05:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి కావున 25వ వార్డులో చేయూత పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సకాలంలో లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలని కౌన్సిలర్ రాధసాయిచంద్ కోరారు.