నవగీతం, జగిత్యాల
నూతన సంవత్సరం సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ని గురువారం జిల్లా ప్రభుత్వ న్యాయవాదులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా అడిషనల్ కలెక్టర్లు బి.ఎస్. లత , బి. రాజగౌడ్ ని కూడా మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఏజీపీ బొగా ఓం ప్రకాష్, మెట్ పల్లి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్, ధర్మపురి ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, కోరుట్ల ఏజీపీ గోనె రాజేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు.

