నవగీతం మెట్ పల్లి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం రోజున సావిత్రీ భాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సావిత్రీ భాయి ఫూలే చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘ సంస్కరణ కోసం ఆమె చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న, సిబ్బంది రాజేందర్, మనోజ్ కుమార్,అంజయ్య, శ్రీకాంత్,దశరథం,లక్మినారాయణ, శ్రీనివాస్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

