నవగీతం, మల్లాపూర్
తెలంగాణ రాష్ట్ర 2వ మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పరిశీలించుటకు జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్ మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం సందర్శించినారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో చేపట్టిన అమ్మకు అక్షరమాల – ఉల్లాస్ అనే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ. మోహన్, మేనేజర్ వెంకటలక్ష్మి, డి వై ఈ ఈ నాగేశ్వర్ రావు, టి పి ఓరాజేంద్ర ప్రసాద్, టి పి ఎస్ అశోక్, ఆర్ ఓ మీర్జా అజ్మతుల్ల బెగ్, మెప్మా ఏ ఓ శ్రీనివాస్ గౌడ్, టిఎంసి శివ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

