నవగీతం,కోడీమ్యాల
కొడిమ్యాల మండల కేంద్రంలో స్వామి వివేకానంద 163 వ జయంతిని వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తపస్వి తన సందేశాల ద్వారా భారత జాతిని జాగృతం చేసిన ఋషి అణువణువున దేశభక్తిని, ధార్మిక శక్తిని చాటిన దేవర్షి, యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద అని అన్నారు. ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి.వివేకానంద విగ్రహ దాత ఆల్ ఫోర్స్ అధినేత ఊట్కూరి నరేందర్ రెడ్డి ,వక్త జిన్నా సత్యనారాయణ రెడ్డి బృందావన్ రిసార్ట్ అధినేత మర్రిపల్లి కొండలరావు ఎంపీడీవో స్వరూప రాణి పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పులామాల వేశారు. విరితో కంచర్ల గంగాచారి మంచాల శ్రీనివాస్ చెన్న దేవేందర్ నాంపల్లి రామచంద్రం చుక్క శ్రీనివాస్ వడ్లకొండ హనుమాన్లు బొమ్మ సురేష్ ఏనుగు ఆదిరెడ్డి బల్ల చిన్న అంజయ్య విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

