Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఆశీర్వదించండి… మన వార్డును అభివృద్ధి పరుస్తా

ఆశీర్వదించండి… మన వార్డును అభివృద్ధి పరుస్తా

📰 Generate e-Paper Clip

స్వతంత్ర అభ్యర్థి శికారి స్రవంతి గోపికృష్ణ

నవగీతం,కోరుట్ల:

ఆశీర్వదించండి… మన వార్డును అభివృద్ధి పరుస్తానని 29వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శికారి స్రవంతి గోపికృష్ణ అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె వార్డులో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మన వార్డును మనమే బాగు చేసుకుందాం అని, తప్పకుండా అవకాశం ఇచ్చి చూడాలని ఓటర్లను కోరారు. పార్టీలకు అతీతంగా వార్డు అభివృద్ధికి నిరంతరం మీకు చేదోడు–వాదోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.వార్డు ప్రస్తుత పరిస్థితులను చూసి ఎంతో ఆవేదనతో స్వతహాగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచించి, మీ ఓటు విలువను గుర్తించి, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గోపికృష్ణ మిత్రులు, వార్డు సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular