Thursday, February 26, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్గద్వాల సోమన్న "పూలవాన" పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న “పూలవాన” పుస్తకావిష్కరణ

📰 Generate e-Paper Clip

నవగీతం, కర్నూలు:

నందవరం మండల పరిధిలోని నాగలదీన్నేలో జడ్పీహెచ్ పాఠశాల  గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న పూలవాన పుస్తకావిష్కరణతో పాటు మమతల కోవెల, గిజిగాని గూడు, పాలపిట్ట పుస్తకాల పరిచయ సభ గుంటూరులో ఘనంగా జరిగింది. పద్మావతి వేదిక, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, బృందవన్ గార్డెన్స్, గుంటూరులో పాలపిట్ట- అమరావతి సాహితీ అధ్యక్షులు డా.రావి రంగారావు, గిజిగాని గూడు -ప్రముఖ నేత్ర వైద్యులు డా.ఆలా సాంబశివారావు, మమతల కోవెల-విమల సాహితీ సమితి అధ్యక్షులు డా. జెల్ది విద్యాధరరావు, పూల వాన ప్రముఖ సాహిత్యవేత్త శ్రీ గంటా మనోహర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మాధవ స్వామి చేతుల మీదగా ఆవిష్కరించడం విశేషం. అనంతరం ఈ పుస్తకాలను సేవారత్న పలకలూరి శివరావు కి అంకితం చేశారు.ఒకే వేదిక, ఒకే రచయిత, ఒకే వ్యక్తి కి అంకితమిచ్చి ఆవిష్కరించడం అరుదైన ఘటన.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular