నవగీతం, మెట్ పల్లి
మెట్ పల్లి పట్టణంలోని మూడో వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వార్డు ప్రజలు మంగళవారం మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ కు వినతిపత్రం సమర్పించారు. వార్డులో ప్రధాన సమస్య అయిన మంచినీటి కొరత తీర్చడానికి 3 బోర్లు వేయించాలని కోరారు. వార్డులోని ప్యాట బాబయ్య ఇంటి నుండి మొదలుకొని బర్ల సాయన్న ఇంటి వరకు గల డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బర్ల సూరి, బర్ల ప్రశాంత్, బర్ల అర్జున్, ఎర్ర మనిదీప్, తరి అక్షయ్, చెర్లపెల్లి పృథ్వి, అంతడ్పుల రాము, పత్రి విజయ్, వైఎంఎస్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

