నవగీతం, చొప్పదండి
చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన ప్రాణ స్నేహితులు చిలుక ప్రదీప్, తాటికొండ సన్నీ చాకుంట అడ్డ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తలా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


