నవగీతం, మల్లాపూర్
మల్లాపూర్ మండలంలోని కొత్త ధాంరాజ్ పల్లి గ్రామంలో రాపుల్స్ యూత్ ఆధ్వర్యంలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.నూతన సీసీ కెమెరాల ను శనివారం రోజున సర్పంచ్ ఎగ్యరపు.లింబాద్రి, ఉప సర్పంచ్ బద్దం హరీష్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి వంశీధర్ రెడ్డి లు ప్రారంభించారు.యూత్ ఆధ్వర్యంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ,మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నరేందర్, శ్రీనివాస్, నాయకులు సుధాకర్ రెడ్డి ,ఆది రెడ్డి,రాజేందర్, రాజరెడ్డి, మధు, యూత్ సభ్యులు రాకేష్, అన్వర్, తిరుపతి,నర్సయ్య, మహేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు

