మజ్జిగ పంపిణి చేసిన వరుణ్ నాయిడు
నవగీతం,వైరా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర హస్త కళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ కుమారుడు నాయుడు వరుణ్ జన్మదినం సందర్భంగా వారి మిత్రబృందం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రయాణికులకు మజ్జిగ మరియు అరటి పండ్లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మేమున్నాము స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మరియు వరుణ్ నాయుడు మిత్రబృందం పాల్గొన్నారు.

