నవగీతం, జగిత్యాల
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతినెల ఈవీఎం గోదాము తనిఖీ లో భాగంగా సోమవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల గోదాములోని ఈవీఎంలను భద్రపరిచిన యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు మరియు సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించారు. గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.

