నవగీతం,మల్లాపూర్
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామపంచాయతీ దగ్గర శుక్రవారం వారసంత ను సర్పంచ్ దప్పుల పద్మ నరసయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకనుండి ప్రతి శుక్రవారం గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద అంగడి నిర్వహించడం జరుగుతుందని ఈ వారసంతలో కూరగాయలు, పండ్లు, బట్టలు,నిత్యవసర సరకులు అన్ని రకాల వస్తువులు లభిస్తాయి. కావున గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలకు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పుష్పలత నరసయ్య, ఉప సర్పంచ్ గంగాధర్, వార్డ్ సభ్యులు రమేష్,శ్రీను,వి డి సి సభ్యులు, గున్నాల విజయ్, జక్కుల అనిల్,గుయ్య శ్రీశైల మల్లేష్, చాకలి నరేష్, ఇట్టేడి సాగర్, మామిడి రవి, కొండయ్య, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

