నవగీతం, మెట్ పల్లి టౌన్ :
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మెట్ పల్లి పట్టణంలోని 11వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన సందర్భంగా కౌన్సిలర్ రెబ్బాసు మహేష్ ను పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేసిగిరి మహేష్ సన్మానించారు. పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లి పూలమాల, శాలువాతో సత్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

