Thursday, April 23, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమృతదేహాన్ని త్వరగా తెప్పించిన మనోజ్

మృతదేహాన్ని త్వరగా తెప్పించిన మనోజ్

📰 Generate e-Paper Clip

అభినందించిన గ్రామస్తులు

నవగీతం, ఇబ్రహీంపట్నం:

ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చెప్పాల నాగయ్య (S/o రాజ గంగారం) దుబాయ్‌లో హార్ట్ ఎటాక్‌తో మృతిచెందిన విషయం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తిమ్మాపూర్ సర్పంచ్ బాస శ్రావణ్ కి తెలియజేయగా, ఆయన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-కన్వీనర్ కట్ట మనోజ్ యాదవ్ సమాచారం అందించారు.కట్ట మనోజ్ యాదవ్ గంగుల మురళీధర్ రెడ్డి తో కలిసి ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా, అధికారులు వెంటనే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే స్పందించి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి మృతుని స్వగ్రామం తిమ్మాపూర్ వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించారు.ఈ సందర్భంలో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి సహాయం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ప్రభుత్వ అధికారులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదలు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular